6 May, 2026 | 11:16 PM

Breaking News

మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త   •   కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •  

తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలి

20-02-2026 01:50 AM

ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా గ్రామ కార్యదర్శి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో తహరా బేగం అన్నారు. గురువారం ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రానున్న వేసవికాలంలో యాక్షన్ ప్లాన్ ముందస్తు ప్రణాళికను ఎల్లారెడ్డి ఎంపీడీవో తాహేర బేగం, పంచాయతీ కార్యదర్శులతో తయారు చేశారు.

ప్రత్యేక సమావేశంలో భాగంగా గ్రామాలలో మంచినీటి సరఫరా సౌకర్యవంతం చేయాలని తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని పంచాయతీ కార్యదర్శుల కు సూచించారు. ఎల్లారెడ్డి మండల పరిషత్ కార్యాలయంలో గురువారం పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి గ్రామాలలో తాగినీటి సౌకర్యం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, పంచాయతీ పరిధిలో నర్సరీలో పర్యవేక్షణ పై ప్రత్యేకంగా చర్చించారు.

పంచాయతీ కార్యదర్శులు గ్రామాలలో విధులు నిర్లక్ష్యం వహించాలని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పట్ల అధికారులు ఆ శ్రద్ధ విడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ ప్రకాష్, ఏపీవో సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.