14 July, 2026 | 4:01 PM

Breaking News

సుధాకర్ కుటుంబానికి ఆర్ధిక సహాయం చేసిన కాంగ్రెస్ నాయకులు   •   తెలంగాణలో SIR గడువు పెంచాలని విజ్ఞప్తి చేశాం: మంత్రి పొన్నం   •   మోదీ, అమిత్ షా స్పందిచరెందుకు?.. 23న మౌనదీక్ష చేస్తా: వీహెచ్   •   కార్మికులకు ఆరోగ్య భరోసా   •   సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే వినోద్ బుద్ది మారాలని మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య పూజలు   •   దుర్గాభవానీ అమ్మవారికి ప్రత్యేక పూజలు   •   అర్హులైన ప్రతి ఒక్కరు ఎస్ఐఆర్లో దరఖాస్తు సమర్పించుకోవాలి   •   చేర్యాలలో మంగళ, శుక్రవారం "డ్రై డే” పాటించాలి   •   ఓటరు జాబితాలో ప్రతి ఒక్కరు తమ పేరు నమోదు చేసుకోవాలి: సర్పంచ్ ఆనంద్ నాయక్   •   పసిపిల్లల ఎదుగుదలకు తొలిముద్దు తోడ్పాటు   •  

కరాటే పోటీల్లో స్టెమ్‌స్పార్క్ రెజొనెన్స్ విద్యార్థుల ప్రతిభ

20-12-2025 12:00 AM

ఖమ్మం, డిసెంబర్ 19 (విజయక్రాంతి): ఖమ్మం నగరంలోని శ్రీనగర్ కాలనీలో గల స్టెమ్‌స్పార్క్ రెజొనెన్స్ స్కూల్ విద్యార్థులు ఇటీవల బెంగుళూరులో నిర్వహించిన 11వ డబ్ల్యూఎఫ్‌ఎస్‌కేఓ నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్ 2025లో అద్భుత ప్రతిభ కనబర్చారు. అండర్ 14 విభాగంలో ఎస్‌కేఅద్నాన్ 4వ తరగతి విద్యార్థి 55కేజీల కటా విభాగంలో 3వ స్థానంలో, కుముతిలో ప్రథమ స్థానంలో బంగారు పతకాన్ని సాధించాడు.

ఎస్‌కే ఉబేద్ 4వ తరగతి విద్యార్థి యెల్లో బెల్టు కటా విభాగంలో మొదటి స్థా నంలో నిలిచి బంగారు పతకాన్ని, స్పోరింగ్‌లో మూడవ స్థానంలో నిలిచి కాంస్య పత కాన్ని సాధించాడు. స్టెమ్‌స్పార్స్ రెజొనెన్స్ శ్రీనగర్ విద్యార్థులు తమ కరాటే నైపుణ్యాలను ప్రదర్శించి తిరుగులేని శక్తిగా నిలిచి వారి అత్యుత్త మ ప్రదర్శనతో ఛాంపియన్షిప్ ట్రోఫిని కూడా కైవసం చేసుకొని ప్రముఖుల అభినందనలు పొందారు.

పాఠశాలలో జరిగిన అభినందన సభలో పాఠశాల డైరెక్టర్స్ కె.శ్రీధర్‌రావు, కృష్ణవేణి ఆ విద్యార్థులను అభినందిం చి ఆశీర్వదించారు.కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్  పీవీఆర్ మురళీమోహన్, కోచ్ ఎస్‌కే ఖాసీమ్, ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది విజేతలను అభినందించారు.