28 March, 2026 | 9:51 PM

పరిశుభ్రతను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత

28-03-2026 07:51 PM

సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పరిశుభ్రతను కాపాడుకోవడం ప్రజలందరి బాధ్యత అని సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ అన్నారు, శనివారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా (99 రోజుల యాక్షన్ ప్లాన్) 7వ వార్డులో పారిశుధ్య ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి మున్సిపల్ ఛైర్మన్ బిరుదు రాధాకృష్ణ, మున్సిపల్ వైస్ చైర్మన్ అంతటి పుష్పలత, మున్సిపల్ కమిషనర్ రమేష్  ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ  మాట్లాడుతూ పట్టణ పరిశుభ్రతను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ప్రజలు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని సూచించారు. ఏడవ వార్డు కౌన్సిలర్ ఉట్ల వరప్రదీప్ , పలువురు వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.