14 June, 2026 | 4:15 PM

Breaking News

ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శికి ఘన సన్మానం   •   ఆసిఫాబాద్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి   •   ఎమ్మెల్యే.. కలెక్టర్ ల చొరవ.. రెండు నెలల్లో వంతెన పనులు పూర్తి   •   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిస్తేనే అభివృద్ధి సాధ్యం: మంత్రి బండి సంజయ్ కుమార్   •   సుల్తానాబాద్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చొప్పరి సుమన్   •   రాష్ట్ర కమిటీలో నైతం కృష్ణారావు చోటు   •   కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎర్రగుంట సర్పంచ్   •   మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల పండుగ   •   రేవంత్ రెడ్డి పాలన ఫస్ట్ ఆఫ్ అట్టర్ ఫ్లాప్: కేటీఆర్   •   రక్తదానం చేసిన సాయి కిషోర్ గౌడ్   •  

మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి

14-10-2025 12:40 AM

- మరుగుదొడ్లు, బస్‌షెల్టర్ల నిర్మాణాలకు రూ.20 లక్షలు మంజూరు

-త్వరితగతిన పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తాం : ఎమ్మెల్యే కూనంనేని 

భద్రాద్రికొత్తగూడెం/సుజాతనగర్, అక్టోబర్ 13, (విజయక్రాంతి) : నియోజకవర్గంలో ప్రజలకు కావాల్సిన కనీస మౌలికవసతుల కల్పనపై కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు ప్రేత్యేక దృష్టి సారించారు. వివిధ పథకాల్లో మంజూరైన నిధులతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతుండగా, అనేక అభివృద్ధిపనులు పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా సుజాతనగర్ మండల కేంద్రంలో మరుగుదొడ్లు, బస్ షెల్టర్, వేపలగడ్డలో మరో బస్ షెల్టర్ నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి.

ఈ సందర్బంగా కూనంనేని మాట్లాడుతూ సుజాతనగర్ మండల కేంద్రంలో ప్రజల సౌకర్యార్ధం మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.10లక్షలు, సుజాతనగర్ మండల కేంద్రం, వేపలగడ్డ గ్రామ సెంటర్లో బస్ షెల్టర్ల నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. ఎమ్మెల్యే నిధులతో చేపట్టనున్న ఈ అభివృద్ధి పనులను ప్రారంభించి త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. అభివృద్ధి పనులు, ప్రజలకు కావాల్సిన మౌలిక వసతుల కల్పనలో ఎలాంటి వివక్ష ఉండబోదని, నియోజకవర్గంలో ప్రజలకు కావాల్సిన అవసరాలు గుర్తించి ఇప్పటికె ప్రతిపాదనలు సిద్ధం చేసి సంబంధిత శాఖలకు అందించామని తెలిపారు. ప్రా ధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు.