14 June, 2026 | 4:33 PM

Breaking News

భోజన ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలి   •   ఆడబిడ్డల ఆత్మీయ సమ్మేళనం   •   ఆలయ నిర్మాణకు విరాళం అందజేత   •   ఎమ్మెల్యే అనుచర వర్గంపై దృష్టి పార్టీ పటిష్టతపై ప్రత్యేక సమావేశాలు.   •   అక్రమంగా మట్టి తరలిస్తున్న వాహనాలు సీజ్: ఎస్ఐ మోతిరామ్   •   పెద్దపల్లిలో నూతన పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు వేగంగా అడుగులు   •   ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శికి ఘన సన్మానం   •   ఆసిఫాబాద్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి   •   ఎమ్మెల్యే.. కలెక్టర్ ల చొరవ.. రెండు నెలల్లో వంతెన పనులు పూర్తి   •   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిస్తేనే అభివృద్ధి సాధ్యం: మంత్రి బండి సంజయ్ కుమార్   •  

రేవంత్ రెడ్డి పాలన ఫస్ట్ ఆఫ్ అట్టర్ ఫ్లాప్: కేటీఆర్

14-06-2026 03:19 PM

హైదరాబాద్: ఖైరతాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఆదివారం తెలంగాణ భవన్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, సంజయ్, దాసోజ్ శ్రవణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన ఫస్ట్ ఆఫ్ అట్టర్ ప్లాఫ్ అయిందని, గత రెండున్నర ఏళ్లలో రేవంత్ రెడ్డి సర్కార్ వేలాడి మంది ఇళ్లను కూల్చిందని పేర్కొన్నారు. 

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదని, మీనాక్షి నటరాజన్ కు వెన్నుపోటు పొడిచింది రేవంత్ రెడ్డే అని కేటీఆర్ తెలిపారు. ఖైరతాబాద్ లో త్వరలో ఉపఎన్నిక వస్తోందని, గరీబోళ్ల ఆకలి తెలిసిన వ్యక్తి నేత కేసీఆర్ అని, కేవలం రూ. 5/- లకే కడుపునిండా భోజనం అందించేలా ‘అన్నపూర్ణ క్యాంటీన్లు’ పెట్టించి లక్షలాది మంది పేదల కడుపు నింపిన అన్నదాత అని గుర్తు చేశారు. కోటి మంది తెలంగాణ ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడం దేవుడెరుగు, కానీ ముందు మహిళలకు నెలకు ఇస్తామన్న రూ.2,500 బాకీతో సహా ఇవ్వు రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.