11 July, 2026 | 8:33 PM

Breaking News

జవహర్ నవోదయలో ప్రవేశాలకు ఆహ్వానం   •   గోపాల్ కుటుంబానికి అండగా ఉంటాం.. రూ.1 లక్ష ఆర్థిక సాయం: మాజీ మంత్రి కేటీఆర్   •   అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం   •   దివ్యాంగురాలిని ఆప్యాయంగా పలకరించిన జిల్లా కలెక్టర్   •   పినపాక మండలంలో ఎస్ఐఆర్ ప్రోగ్రామ్   •   శాతవాహన క్రీడా మైదానంలో 'సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్' నిర్మాణానికి భూమి పూజ   •   ఈనెల 13న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భూపాలపల్లి జిల్లా పర్యటన   •   మొదటి వేతనంతో పాఠశాలకు సౌండ్ సిస్టం అందించిన సర్పంచ్   •   లింగాపూర్ స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   మత్తు పదార్థాలు, సామాజిక మాధ్యమాల దుర్వినియోగం, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి   •  

ఐదుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్

17-12-2025 04:39 PM

హైదరాబాద్: తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఐదు మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక తీర్పు వెలువరించారు. ఐదు మంది ఎమ్మెల్యేల బీఆర్ఎస్ వేసిన అనర్హత పిటిషన్లను స్పీకర్ తోసిపుచ్చారు.  పార్టీ మారినట్లు ఆధారాలు చూపలేకపోయారని, ఎమ్మెల్యేలు తెల్లాం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికెపూడి గాంధీకి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లరె స్పీకర్ ప్రసాద్ కొట్టేశారు. రేపు మరో ముగ్గురు ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ తీర్పు ప్రకటించనున్నారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్ స్పీకర్ ప్రసాద్ ఇచ్చిన నోటీసులకు వారు ఇంకా స్పందించకపోవడంతో విచారణ ఇంకా పూర్తికాలేదు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసులో సుప్రీంకోర్టు గడువు రేపటితో ముగియనుంది.