500 కోసం తండ్రిని చంపిన కొడుకు
జహీరాబాద్: సంగారెడ్డి జిల్లా(Sangareddy) జహీరాబాద్ మండలం అలీపూర్ గ్రామంలో బుధవారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. తన ప్యాంటు జేబులోంచి 500 రూపాయల నోటు కనిపించకుండా పోవడంపై తలెత్తిన గొడవలో ఒక 35 ఏళ్ల వ్యక్తి తన తండ్రిని హతమార్చాడు. తన ప్యాంటు జేబులోంచి ఆ కరెన్సీ నోటును తన తండ్రే తీసుకున్నారని అనుమానించిన తుకారాం ఆయన్ని నిలదీశాడు.
అయితే, తాము డబ్బు తీసుకోలేదని తండ్రి స్పష్టం చేసినప్పటికీ, తుకారాం మాత్రం ఆయనతో వాదనను కొనసాగించాడు. తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన తుకారాం కత్తితో తన తండ్రిపై దాడి చేయడంతో ఆయనకు తీవ్రమైన గాయాలయ్యాయి. బాధితుడు అక్కడికక్కడే మరణించాడని పోలీసులు తెలిపారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నారు.






