తహసిల్దార్ కార్యాలయంలో దూరిన పాము
పరుగులు తీసిన అధికారులు, సిబ్బంది
స్నేక్ క్యాచర్ వచ్చి పామును పట్టుకోవడంతో ఊపిరి పీల్చుకున్న సిబ్బంది
గిర్ధావర్ గదిలో పాము.. భయాందోళనకు గురైన సిబ్బంది
కుభీర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా మండల కేంద్రం కుభీర్ తహసీల్దార్ కార్యాలయంలోని గిర్ధావర్ గదిలోకి పాము దూరడంతో సిబ్బంది ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో పాము కనిపించడంతో ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. ఆందోళన గురయ్యారు. వెంటనే స్నేక్ క్యాచర్కు సమాచారం అందించగా, భైంసా నుండి అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ పామును సురక్షితంగా పట్టుకున్నారు.
దీంతో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. సుమారు గంటన్నర పాటు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. నాగుల పంచమి రోజైనా సోమవారం కార్యాలయంలో పాము ప్రత్యక్షం కావడంతో అధికారులు సిబ్బంది వివిధ పనుల నిమిత్తం వచ్చిన ఆయా గ్రామాల ప్రజలు పామును దర్శించుకుని దర్శించుకున్నారు. పాము అటవీ ప్రాంతంలో వదిలేయనున్నట్టు స్నేక్ క్యాచర్ తెలిపారు.






