13 May, 2026 | 1:14 PM

Breaking News

పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో విచారణ.. బండి భగీరథ్ రాకపై ఉత్కంఠ   •   విజిల్ గుర్తు.. తమిళనాడు చరిత్ర మార్చింది: సీఎం విజయ్   •   బాన్సువాడ ఆర్డీవో గా రవీందర్ రెడ్డి   •   వడదెబ్బపై అవగాహన.. ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ   •   సత్తుపల్లి నుంచి అంకంపాలెం వరకు నూతన బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె   •   బలపరీక్షలో నెగ్గిన విజయ్‌ సర్కార్.. అసెంబ్లీ నుంచి డీఎంకే వాకౌట్   •   షాద్‌నగర్ బైపాస్‌లో ప్రమాదం..!   •   అండర్ డ్రైనేజీ వేసాకే సీసీ రోడ్లు వేయండి   •   రేపు అశ్వారావుపేటలో రాష్ట్రస్థాయి పామాయిల్ రైతుల ఆత్మీయ సమావేశం   •   కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థత.. గురుగ్రామ్ ఆసుపత్రిలో చేరిక   •  

స్మృతి మంధాన ప్రాక్టీస్ షురూ

09-12-2025 01:19 AM

ఇండోర్, డిసెంబర్ 8 : భారత మహిళల జట్టు స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన తిరిగి ప్రాక్టీస్ ప్రారంభించింది. మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్ ముచ్చల్‌తో వివాహం రద్దయిందని ప్రకటించిన 24 గంటల్లోపే నెట్స్‌లో అడుగుపెట్టింది. త్వరలో శ్రీలంకతో జరగనున్న సిరీస్ కోసం స్మృతి సన్నద్ధమవుతోంది. స్మృతి ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలను ఆమె సోదరుడు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు.

నవంబర్ 23న పలాశ్ ముచ్చల్‌తో ఆమె వివాహం జరగాల్సి ఉండగా అనూ హ్య పరిస్థితులతో వాయిదా పడింది. స్మృతి తండ్రి గుండెపోటుతో హాస్పిటల్‌లో చేరడం, తర్వాత పలాశ్ కూడా ఆసుపత్రి పాలవడం వంటి పరిణామాలతో గందరగోళం నెలకొంది. ఆదివారం తన పెళ్లి రద్దయినట్టు సోషల్ మీడియా వేదికగా స్మృతి ప్రకటించింది. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని కోరింది. ఇకపై క్రికెట్‌పైనే తన ఫోకస్ అంతా అంటూ రాసుకొచ్చింది. తాను అన్నట్టుగానే తన బ్రేకప్ బాధ నుంచి డైవర్ట్ అయ్యేందుకు మళ్లీ బ్యాట్ పట్టింది.