మాజీ డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డికి రాఖీ కట్టిన సోదరీ అరుణ
బాన్సువాడ,(విజయ క్రాంతి): రాఖీ పౌర్ణమి (రక్షా బంధన్) పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని నివాసంలో మాజీ డీసీసీబీ చైర్మన్, బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోచారం భాస్కర్ రెడ్డికి తన సోదరీ పోచారం అరుణ రాఖీ కట్టి సోదర అనుబంధాన్ని చాటుకున్నారు. అదేవిధంగా పోచారం సురేందర్ రెడ్డికి కూడా రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. మరో సోదరుడు హైదరాబాద్లోని తన నివాసంలో డాక్టర్ పోచారం రవీందర్ రెడ్డికి వారి నివాసంలో రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అన్నా–చెల్లెలు, అక్కా–తమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీక రాఖీ పండుగ. ప్రతి సోదరి సంతోషంగా, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ సోదరీమణులందరికీ భాస్కర్ రెడ్డి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.






