28 August, 2026 | 9:07 PM

రాఖీ వేడుకల్లో ఎమ్మెల్యే వంశీకృష్ణ

28-08-2026 06:20 PM

అచ్చంపేట: రాఖీ పౌర్ణమి సందర్భంగా అచ్చంపేట ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ తన సోదరీమణులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. సోదరీమణులు ఎమ్మెల్యేకు రాఖీలు కట్టి ఆప్యాయతను చాటుకున్నారు. ఈ సందర్భంగా అక్కాచెల్లెళ్లకు ఎల్లవేళలా అండగా ఉంటానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. రాఖీ పౌర్ణమి సోదరసోదరీమణుల ప్రేమ, అనుబంధానికి ప్రతీక అని పేర్కొంటూ.. అచ్చంపేట నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.