14 June, 2026 | 4:16 PM

Breaking News

ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శికి ఘన సన్మానం   •   ఆసిఫాబాద్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి   •   ఎమ్మెల్యే.. కలెక్టర్ ల చొరవ.. రెండు నెలల్లో వంతెన పనులు పూర్తి   •   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిస్తేనే అభివృద్ధి సాధ్యం: మంత్రి బండి సంజయ్ కుమార్   •   సుల్తానాబాద్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చొప్పరి సుమన్   •   రాష్ట్ర కమిటీలో నైతం కృష్ణారావు చోటు   •   కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎర్రగుంట సర్పంచ్   •   మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల పండుగ   •   రేవంత్ రెడ్డి పాలన ఫస్ట్ ఆఫ్ అట్టర్ ఫ్లాప్: కేటీఆర్   •   రక్తదానం చేసిన సాయి కిషోర్ గౌడ్   •  

బ్యాంకాక్‌లో కాల్పుల కలకలం

29-07-2025 02:04 AM
  1. దుండగుడి చేతిలో ఐదుగురు హతం
  2. అనంతరం తననుతాను కాల్చుకున్న నిందితుడు

న్యూఢిల్లీ, జూలై 28: థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఐదుగురు చనిపోయారు. అనంతరం దుండగుడు తన ను తాను కాల్చుకున్నాడు. పోలీసులు ఘట నా స్థలానికి చేరుకొని ముమ్మర దర్యాప్తు చేపట్టారు. అక్కడి మీడియా తెలిపిన ప్రకా రం థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లోని ఓర్ టు కో మార్కెట్‌లోకి చొరబడి నలుగు రు సెక్యూరిటీ గార్డులు, ఓ మహిళను మట్టుబెట్టాడు.

అనంతరం తననుతాను కాల్చు కున్నాడు. ప్రసిద్ధ పర్యాటక ప్రదేశమైన చతుచక్ మార్కెట్ సమీపంలో ఈ ఘటన జర గింది. స్థానికులతో పాటు పర్యాటకులు అ ప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈ కాల్పులకు థాయ్‌లాండ్ కంబోడియా సరిహద్దు వద్ద జరుగుతున్న ఘర్షణలతో ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మే నెలలో సైతం థాంగ్ జిల్లాలోని ఓ పాఠశాల సమీపంలో దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పో యారు.