18 July, 2026 | 8:23 PM

Breaking News

ఎల్నినో ప్రభావంతో రైతులు ఆరుతడి పంటల సాగు వైపు మొగ్గు చూపాలి   •   బీఆర్ఎస్ కార్యకర్త తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే   •   పార్టీ కార్యకర్తలను పట్టించుకోని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ వైఖరి!   •   కేసుల పరిష్కారానికి కృషి జరగాలి   •   ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయండి   •   సూర్యాపేట జిల్లా సృష్టికర్త జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు   •   అదనపు తరగతి గదులను ప్రారంభించిన ఎమ్మెల్యే   •   ఉపాధ్యాయులకు ట్రాఫిక్, సైబర్ నేరాలపై అవగాహన   •   నాయకత్వం అంటే పదవి కాదు.. బాధ్యత   •   కొల్గూర్ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ విభాగం ప్రారంభం   •  

వర్షాలు కురవాలని వానదేవుడిని వేడుకున్న షేక్‌పల్లి గ్రామస్తులు

18-07-2026 07:43 PM

ఎర్రవల్లి: వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలంలోని షేక్‌పల్లి గ్రామస్తులు శనివారం ప్రత్యేకంగా వానదేవుడిని ప్రార్థించారు. గ్రామంలోని మహిళలు, పురుషులు, యువత కలిసి ఎడ్లబండిపై సంప్రదాయ పద్ధతిలో షేక్‌పల్లి నుంచి బీచుపల్లి వరకు సుమారు ఆరు కిలోమీటర్ల దూరం భక్తిశ్రద్ధలతో ఊరేగింపుగా వెళ్లారు. ఈ సందర్భంగా కోలాటాలు ఆడుతూ, బతుకమ్మ పాటలు పాడుతూ, వానదేవుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురిపించాలని వేడుకున్నారు. అనంతరం బీచుపల్లి అంజన్న స్వామి ఆలయానికి చేరుకుని ప్రత్యేక మొక్కులు చెల్లించడంతో పాటు గ్రామానికి మంచి వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని ప్రార్థనలు నిర్వహించారు.