1 September, 2026 | 10:14 PM

Breaking News

భూ రీ సర్వేను నిలిపివేయాలని గ్రామస్తుల ధర్నా   •   ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి   •   అశ్వాపురం రైస్‌మిల్‌ యజమాని అరెస్ట్‌   •   రేషన్ షాపుల ద్వారా బియ్యంతో పాటు చక్కెర కిరోసిన్ పంపిణీ చేయాలి   •   కార్పొరేట్ శక్తులకు పట్టం కడుతుం కేంద్ర ప్రభుత్వం   •   22ఏ భూముల వివరాలు పక్కాగా సిద్ధం చేయాలి   •   సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలి   •   ఓపీఎస్‌ కోసం ఉద్యోగుల గళం.. నల్ల బ్యాడ్జీలతో నిరసన   •   కరీంనగర్ జిల్లా గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా నల్లగొండ తిరుపతి గౌడ్ నియామకం   •   ఉద్యోగులకు పాత పెన్షన్ విదానాన్ని అమలు చేయాలి   •  

శిరీష హత్యాచార నిందితుడికి కఠిన శిక్ష

01-09-2026 | 08:34pm

ఇల్లెందు,(విజయక్రాంతి): ఆదివాసీ యువతి శిరీషపై(Adivasi young woman Sirisha) అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన సనవుల్లా ఖాన్‌ను కఠినంగా శిక్షించాలని పీడీఎస్‌యూ జిల్లా నాయకుడు గంగాధర గణేష్‌(PDSU district leader Gangadhar Ganesh) డిమాండ్‌ చేశారు. పీడీఎస్‌యూ ఇల్లందు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు మంగళవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా గణేష్‌ మాట్లాడుతూ.. ఆదివాసీ కుటుంబం నుంచి ఉన్నత విద్యను అభ్యసించి నర్సుగా పనిచేస్తూ కుటుంబానికి అండగా ఉన్న శిరీష అత్యాచారానికి గురై హత్యకు గురికావడం తీవ్ర ఆవేదన కలిగించిందన్నారు.

మహిళలపై అత్యాచారాలు పునరావృతమవుతున్నా నిర్భయ చట్టాలను సమర్థంగా అమలు చేయడంలో పాలకులు విఫలమవుతున్నారని విమర్శించారు. మహిళలకు పని ప్రదేశాల్లో, ప్రయాణాల్లో భద్రత కల్పించడంతో పాటు రక్షణ చర్యలు చేపట్టని యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అత్యాచారాలు, నేరాలకు కారణమవుతున్న గంజాయి, డ్రగ్స్‌, కొకైన్‌ వంటి మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఆయుష్‌, లక్ష్మీనరసింహ, వెన్సికా, లిఖిత, సికిందర్‌, అక్షయ, హేమచంద్ర, సాయి, చరణ్‌, సింధుజ, నందిని తదితరులు పాల్గొన్నారు.