6 June, 2026 | 4:53 PM

ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ 55 ఎంపిక

06-06-2026 03:39 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా నుండి ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ కు 55 మంది విద్యార్థులు ఎంపికైనట్లు నిర్మల్ జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న తెలిపారు. జిల్లాలో అత్యధికంగా మస్కాపూర్ జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల నుండి 26 మంది ఎంపిక కాగా పొనకల్, బీరవెల్లి, మామడ, నర్సాపూర్ జీ పాఠశాలల నుండి ముగ్గురు చొప్పున, రాజుర, మంజులాపూర్ గర్ల్స్ హై స్కూల్ సోమ్వారిపేట్, లక్ష్మణ్ చందా పాఠశాల నుండి ఇద్దరు చొప్పున, మున్యాల, పెంబి, కడెం, లింగాపూర్, జాఫ్రాపూర్, కొరటికల్ ,కుబీర్, మోడల్ స్కూల్ కుంటాల నుండి ఒకరు చొప్పున ఎంపికైనట్లు వెల్లడించారు. ఈ విద్యార్థులు గత విద్యా సంవత్సరంలో 8వ తరగతి చదువుతూ  ఈ పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. ఈ ఎంపికైన విద్యార్థులకు ప్రతి సంవత్సరం 12000 చొప్పున నాలుగు సంవత్సరాలు పాటు స్కాలర్షిప్ లభిస్తుందని చెప్పారు