14 July, 2026 | 11:12 AM

Breaking News

విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే అక్రమ అరెస్టులా?   •   తగ్గిన రూపాయి విలువ.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు   •   కనుగుట్ట శబరిమాత ఆశ్రమానికి నిధుల మంజూరుకి హామీ   •   గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులది కీలక పాత్ర   •   చలో సచివాలయం నేపథ్యంలో సీపీఎం నాయకుల అరెస్ట్   •   Strait of Hormuz Crisis: ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆంక్షలు.. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్ వార్నింగ్   •   CM Revanth Reddy Delhi Tour: కేంద్ర మంత్రులతో కీలక భేటీలు.. తెలంగాణ ప్రాజెక్టులపై నేడు కీలక చర్చలు   •   జోగులాంబ క్షేత్రంలో భక్తి వైభవం   •   సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ పాలన   •   వనపర్తి అభివృద్ధే మా లక్ష్యం.. ప్రజల తీర్పే కాంగ్రెస్‌కు బలం   •  

జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక

06-11-2025 01:37 AM

లక్షెట్టిపేట, నవంబర్ 5: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థినులు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరచి జాతీయ స్థాయికి ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపల్ రామా కళ్యాణి బుధవారం తెలిపారు. మహబూబబాద్ జిల్లా నెల్లికుదురులో నిర్వహించిన రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో లక్షెట్టిపేట గురుకుల పాఠశాల నుంచి జమిడి ప్రవళిక అద్భుత ప్రదర్శన కనబరచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు.

ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో జరగబోయే జాతీయ షూటింగ్ బాల్ పోటీల్లో రాష్ట్ర జట్టు తరపున పాల్గొంటారన్నారు. పీఈటీ డి. రమాదేవి, సిహెచ్ మమతలను ఈ సందర్భంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యాయని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.