2 May, 2026 | 6:28 PM

రైతులకు పంటలపై అవగాహన కల్పించిన శాస్త్రవేత్తలు

02-05-2026 05:26 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కోదురుపాక గ్రామపంచాయతీ కార్యాలయం లో శనివారం మండల వ్యవసాయ అధికారి పైడితల్లి ఆధ్వర్యంలో  రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో  పార్స్, పొలాస నుండి శాస్త్రవేత్తలు  డాక్టర్ జి.వేణుగోపాల్, డాక్టర్ జయంత్  పాల్గొని రాబోయే వానకాలంలో వేసే వరి పంటలో అనువైన రకాలపై అవగాహన కల్పించారు. మార్కెటింగ్ డిమాండ్ ఉన్న ఇతర వాణిజ్య పంటల అమ్మకంలో  మార్కెట్ వివరాలు, నానో ఎరువుల వాడకం గురించి రైతులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉత్తమకుమారి, ఏ ఈ ఓ డి. ప్రశాంత్, ఉప సర్పంచ్ , రైతులు పాల్గొన్నారు.