15 June, 2026 | 11:17 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద స్కూల్ సాయిల్ హెల్త్ కార్యక్రమం

25-02-2026 01:04 AM

మండల వ్యవసాయ అధికారి అనురాధ

మొయినాబాద్ ఫిబ్రవరి 24(విజయ క్రాంతి): మొయినాబాద్ మండలం చిల్కూర్ గ్రామంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ పాఠశాలలో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం కింద స్కూల్ సాయిల్ హెల్త్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. విద్యార్థుల్లో మట్టి ఆరోగ్య ప్రాముఖ్యత, స్థిరమైన వ్యవసాయ విధానాలు, భూమి సంరక్షణపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యంగా నిర్వహించారు.

రాష్ట్రానికి కేటాయించిన లక్ష్యాలలో భాగంగా వ్యవసాయ శాఖ మరియు పాఠశాల విద్యాశాఖ సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శ్రీమతి అనురాధ, వ్యవసాయ విస్తరణ అధికారులు శ్రీ సునీల్ కుమార్, శ్రీ పండరి, పాఠశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ శ్రీ ఎం. షౌరి రాజు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు శ్రీ జి. సునీల్ కుమార్, శ్రీమతి మాధురి, శ్రీమతి పి. సునీత విద్యార్థులను ప్రోత్సహించారు.

9వ, 10వ తరగతులకు చెందిన సుమారు 100 మంది విద్యార్థులకు మట్టి ఆరోగ్యం, మట్టి సారవంతత, మట్టి నమూనాలు సేకరణ విధానం, మట్టి పరీక్ష ప్రక్రియ, సాయిల్ హెల్త్ కార్డు ప్రయోజనాలపై వివరంగా అవగాహన కల్పించారు. సమీప రైతుల పొలాల నుండి మట్టి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించడం, పరీక్ష ఫలితాల ఆధారంగా సాయిల్ హెల్త్ కార్డులు తయారు చేసి రైతులకు అందజేయడం గురించి కూడా వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో శాస్త్రీయ వ్యవసాయం పట్ల అవగాహన పెంపొందించి, భవిష్యత్లో మట్టి ఆరోగ్య పరిరక్షణలో భాగస్వాములు కావాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు.