22 May, 2026 | 9:50 PM

Breaking News

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు   •   ప్రభాకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి   •   సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు చేయాలి   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   పేకాట స్థావరంపై దాడి   •   వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్   •   మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •  

సత్యసాయి జయంతి వేడుకలు

24-11-2025 12:00 AM

కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి టౌన్, నవంబర్ 23 :  మానవ సేవే మాధవ సేవ అని నమ్మి ఎంతో మందికి సేవలు చేసిన సత్యసాయి భగవాన్ సమానుడే అని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు.  ఆదివారం సత్యసాయి 100వ జన్మదినోత్సవం సందర్భంగా ఐ.డి. ఒ.సి ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ సత్యసాయి చిత్ర పటానికి పుష్పాలతో నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సత్యసాయి చేసిన సేవలు ప్రతి ఒక్కరికి ఒక స్ఫూర్తి దాయకమని అన్నారు.  ప్రజా సేవకై ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి అనేక రకాల సేవలు అందించారని గుర్తు చేశారు. అందుకే నేడు సత్యసాయి జయంతిని నేడు ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. 

సత్యసాయి చూపిన సన్మార్గంలో నడిచి ప్రతి ఒక్కరు ఇతరుల పట్ల ప్రేమ అభిమానం చూపిస్తూ తగిన సహాయం చేయగలిగితే మానవాళి సుఖసంతోషాలతో ఉంటారనీ సూచించారు. ఆర్డీఓ సుబ్రమణ్యం, తహసిల్దార్  రమేష్ రెడ్డి, సత్యసాయి జిల్లా కమిటీ  కన్వీనర్, సాయిరాం, సాయిరెడ్డి, నరహరి యూత్ కోఆర్డినేటర్, భాగ్యమ్మ మహిళా కోఆర్డినేటర్, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.