ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో సత్తుపల్లికి మొదటి స్థానం
16-05-2026 01:47 AM
సత్తుపల్లి మే 15. ( విజయ క్రాంతి ): రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సారథ్యంలో, ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ అవిరళ కృషితో సత్తుపల్లి నియోజకవర్గం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , క్షేత్రస్థాయిలో అహర్నిశలు శ్రమిస్తున్న ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ సత్తుపల్లి ప్రజల తరపున హృదయపూర్వక అభినందనలు.






