2 June, 2026 | 6:27 PM

Breaking News

విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో విశేష సేవలు అందించిన లైన్‌మ్యాన్ దేవ్ సింగ్ కు ఉత్తమ ఉద్యోగి అవార్డు   •   మండల వ్యాప్తంగా ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు   •   గుంజపడుగు గ్రామంలో వ్యర్థాలపై ప్రజలకు సర్పంచ్ అవగాహన   •   ఘనంగా అవతరణ వేడుక   •   పలు గ్రామాల్లో పీసీసీ కేంద్రాలను సందర్శించిన డిసిఎస్ఓ వెంకటేశ్వర్లు   •   పట్టపగలే యదేచ్చగా మొరం తవ్వకాలు.. చోద్యం చూస్తున్న అధికారులు   •   అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు   •   కాగజ్‌నగర్ సభలో ఎమ్మెల్యేకు ప్రోటోకాల్ అంశంపై బీఆర్ఎస్ ఆరోపణలు   •   పరిపాలన చేతకాక సీఎం బూతు మాటలు మాట్లాడుతున్నారు: ఎమ్మెల్యే తలసాని   •   రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఉద్యమకారులు, పారిశుధ్య కార్మికులకు ఘన సన్మానం   •  

తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన సత్తుపల్లి ఫారెస్ట్ డివిజన్

02-06-2026 05:27 PM

సత్తుపల్లి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సత్తుపల్లి ఫారెస్ట్ డివిజన్ కార్యాలయంలో సోమవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజనల్ మేనేజర్ జి. చంద్రమోహన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన అమరవీరులను స్మరించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దారితీసిన ఉద్యమం ప్రజల ఆకాంక్షల ఫలితమని, రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

అనంతరం తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్లాంటేషన్ మేనేజర్లు వి. బ్రహ్మచారి, ఎన్. చంద్రకళ, డిప్యూటీ ప్లాంటేషన్ మేనేజర్లు తిరుమలరావు, శిరోమణి, క్షేత్రస్థాయి సిబ్బంది, అటవీ కార్మికులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం మరింత పచ్చదనంతో, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ వేడుకలు ముగిశాయి.