అల్ఫోర్స్లో సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి
18-04-2026 12:58 AM
కొత్తపల్లి, ఏప్రిల్ 17 (విజయ క్రాంతి): అల్ఫోర్స్ విద్యాసంస్థలలో మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ వర్ధంతిని నిర్వహించారు. విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి నివాళులర్పించి మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణ భారత దేశంలో విశిష్టమైన పాత్ర పోషించారని, వారు చేసిన సేవలు చరిత్ర పుటల్లో నిలిచిపోతాయని అన్నారు.
సర్వేపల్లి రాధాకృష్ణ రాష్ట్రపతిగా, భారతదేశ మొదటి ఉపరాష్ట్రపతిగా అనేక సేవలు అందించారని, ప్రజలకు అనేక పథకాలను ప్రవేశపెట్టి ప్రజల శ్రేయస్సు కోరిన గొప్ప రాజనీతిఘ్నుడని కొనియాడారు. వారిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.






