27 June, 2026 | 7:44 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

సాంట్నర్ మెరుపులు వృథా.. విండీస్‌దే తొలి టీ20

06-11-2025 12:00 AM

ఆక్లాండ్, నవంబర్ 5 : న్యూజిలాండ్ పర్యటనను వెస్టిండీస్ విజయంతో ఆరంభించింది. తొలి టీ ట్వంటీలో 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ అభిమానులను ఉత్కంఠతో ఊపేసింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 6 వికెట్లకు 164 పరుగులు చేసింది. ఓపెనర్లు నిరాశపరిచినా షై హోప్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 39 బంతుల్లో 53 పరుగులు చేశాడు. ఛేజింగ్‌లో న్యూజిలాండ్ ఓపెనర్ రాబిన్‌సన్(27),రచిన్(21) ధాటిగా ఆడడడంతో సునాయాసంగా గెలిచేలా కనిపించింది.

అయితే మిడిల్ ఓవర్లలో విండీస్ బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు. ఫీల్డింగ్‌లోనూ అదరగొట్టారు. దీంతో 107/9 రన్స్‌తో ఓటమి అంచున నిలిచింది. ఈ దశ లో కెప్టెన్ శాంట్నర్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 28 బంతుల్లోనే 55(8 ఫోర్లు,2 సిక్స ర్లు) రన్స్‌తో గెలిపించేందుకు ప్రయత్నించాడు. చివర్లో విండీస్ బౌలర్లు కట్టడి చేయడంతో కివీస్ 157 పరుగులే చేయగలిగింది. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీ స్‌లో విండీస్ 1 ఆధిక్యంలో నిలిచింది.