ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సిపిఐ ఏఐటీయూసీ సంపూర్ణ మద్దతు
యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆర్టీసీ కార్మికులు చేస్తున్నా రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మెలో భాగంగా యాదగిరిగుట్ట డిపో వద్ద కార్మికులు సమ్మెకు సిపిఐ, ఏఐటీయూసీ నాయకులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీని పూర్తిగా ప్రభుత్వంలో విలీనం చేసి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కార్మికుల సంక్షేమాన్ని పరిరక్షించాలి.
కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే అమలు చేసి, కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి, శాశ్వత ఉద్యోగ భద్రత కల్పించాలని, పెండింగ్లో ఉన్న పే స్కేల్, పిఆర్సి బకాయిలను వెంటనే విడుదల చేయాలని, అపాయింట్మెంట్ తేదిన ప్రకటించాలని, యూనియన్ లను పునరుద్ధరించాలని అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.






