14-02-2026 12:00:00 AM
మెదక్, ఫిబ్రవరి 13 (విజయ క్రాంతి) : మెదక్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీ లో శుక్రవారం ఓట్ల లెక్కింపు ప్రక్రియ హోరా హోరీగా కొనసాగింది. ప్రతీ రౌండ్ లో తీవ్ర ఉత్కంఠత మధ్య సాగింది. మెదక్ జిల్లాలోని మెదక్ మున్సిపాలిటీ లో 32 వార్డులు, తూప్రాన్ లో 16 వార్డులు, నర్సాపూర్లో 15 వార్డులు, రామాయంపెట్లో 12 వార్డులకు సంబంధించి కౌటింగ్ ప్రారంభమైంది. 8 గంటలకు కౌటింగ్ ప్రారంభం కాగా ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. మెదక్ లో బీఆర్ఎస్ 15 సీట్లు కైవసం చేసుకోగా, కాంగ్రెస్ 14 సీట్లు, బీజేపీకి 2 సీట్లు, బీఎస్పీ ఒక సీటు గెలిచాయి.
అలాగే తూప్రాన్ మున్సిపల్ ఎన్నికల భాగంగా 16 వార్డులకు ఎన్నికలను లెక్కించగా అధికంగా బిఆర్ఎస్ అభ్యర్థులు 9, కైవసం చేసుకోగా, కాంగ్రెస్ 4, బిజెపి 2 సీట్లు గెలిచాయి. రామాయం పెట్ మున్సిపల్ లో 12 వార్డులకు కాంగ్రెస్ 8, బిఆర్ఎస్ 3, బీజేపీ 1 సీట్లు గెలిచాయి. నర్సాపూర్ మున్సిపల్ లో 15 వార్డులకు గాను కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 5, బీజేపీ 4 సీట్లు గెలిచాయి.
కీలకంగా మారనున్న బీజేపీ అభ్యర్థులు..
మెదక్ మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ అభ్యర్థులు కీలకంగా మారనున్నారు. చైర్మన్ పీఠం కైవసం చేసుకోవాలంటే అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతి పక్ష పార్టీ బిఆర్ఎస్ కు బీజేపీ అభ్యర్థులతో పాటు ఒకరు బీఎస్పీ అభ్యర్థి మద్దతు ఇస్తేనే చైర్మన్ పీఠం దక్కే అవకాశం ఉంది.