10లక్షలతో రోడ్డు పనులు ప్రారంభం
03-08-2026 04:29 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి మున్సిపాలిటీ 4వ వార్డులో యూఐడీఎఫ్ నిధులు రూ. 10 లక్షలతో నిర్మించనున్న నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన పనులను బెల్లంపల్లి మున్సిపల్ ఛైర్ పర్సన్ దావ స్వాతి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డ్ కౌన్సిలర్ ఈట కమల, నాయకులు అస్మా షేక్, డికొండ రాజలింగం, నీలి కృష్ణ, పీక లక్ష్మణ్, ఆసిఫ్, యూనస్, మున్సిపల్ డీఈ సుమతి, ఏఈ నిఖిల్ పాల్గొన్నారు.






