నవ లిమిటెడ్ సహకారంతో ప్రభుత్వ పాఠశాలల్లో దంత వైద్య శిభిరం
03-08-2026 04:34 PM
పాల్వంచ,(విజయక్రాంతి): నవ లిమిటెడ్ పాల్వంచ వారి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమంలో భాగంగా సోమవారం పాల్వంచ మండల పరిధిలోని జగన్నాధపురం జెడ్ పి ఉన్నత పాఠశాల విద్యార్థులకు , హైదరాబాదుకు చెందిన రోహిణి సౌజన్యంతో ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
ఉచిత దంత వైద్య శిబిరానికి ముఖ్య అతిధిగా డిఎం అండ్ హెచ్ఓ డా.తుకారాం రాథోడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ "ఓరల్ కేర్, ఐరన్ హెల్డీ చైల్డ్" అనే కార్యక్రమంతో విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపటం ,ఇలాంటి దంత వైద్య శిబిరాన్ని నవ లిమిటెడ్ ఏర్పాటు చేయటం ఎంతో గొప్ప విషయం అని తెలిపారు.






