5 May, 2026 | 1:53 PM

Breaking News

పదవ తరగతిలో ప్రతిభ చాటిన శాలివాహన విద్యార్థులకు ఘన అభినందనలు   •   దేవరకొండ మున్సిపాలిటీ నూతన కమిషనర్‌కు బీసీ సంఘం ఆధ్వర్యంలో సన్మానం   •   వడదెబ్బతో బాలిక మృతి   •   మిషన్ భగీరథ నీరు సరిగా అందడం లేదు: మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్   •   కన్నాలలో మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం   •   రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు విస్తృతంగా నిర్వహించాలి   •   లింగుపల్లి ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జాయింట్ కలెక్టర్   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు   •   UAEపై దాడులు, భారతీయులకు గాయాలపై ప్రధాని మోదీ కీలక ప్రకటన!   •   “ITP Aero – India” ప్లాంటుకు శ్రీధర్ బాబు శంకుస్థాపన   •  

సోషల్ మీడియాపై ఆంక్షలు అవసరం!

07-02-2026 12:00 AM

నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది చిన్నారులు సోషల్ మీడియా మాయాజాలంలో చిక్కుకుని తమ అమూల్యమైన బాల్యాన్ని, మానసిక ప్రశాంతతను కోల్పోతున్నారు. ఈ భయంకరమైన పరిస్థితిని గమనించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, 16 ఏళ్లలోపు పిల్లలపై సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించే దిశగా చారిత్రాత్మక చట్టాన్ని తీసుకురావాలని యోచిం చడం హర్షనీయం. ఈ నిర్ణయం కేవలం ఒక రాష్ట్రానికే పరిమితం కాకుం డా, మన తెలంగాణలోనూ తక్షణమే అమలు చేయాల్సిన అవసరముంది.

తెలంగాణ సాంకేతిక పరిజ్ఞానంలో అగ్రగామిగా ఉండటంతో ఇక్కడ స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరిగిపోయింది. ఏపీ తరహాలో మన రాష్ట్రంలోనూ 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాను పూర్తిగా నిషేధించే చట్టాన్ని తీసుకురావాలి. చట్టపరమైన ఆంక్షలు అమలు చేయడంలో ఎదురయ్యే సవాళ్లను సైబర్ నిపుణుల సలహాలతో అధిగమించాలి. కేవలం నిషేధంతోనే సరిపెట్టకుండా, పాఠశాల స్థాయి నుంచే డిజిటల్ అక్షరాస్యతను బోధించాలి. సోషల్ మీడియాకు ప్రత్యామ్నాయంగా ఆటస్థలాలు, గ్రంథాలయాల వైపు పిల్లలను మళ్లించాలి. రెండు రాష్ట్రాలు ఒకే విధమైన విధానాన్ని రూపొందిస్తే, అది దేశవ్యాప్తంగా ఒక గొప్ప సంస్కరణకు నాంది పలుకుతుంది.

భూమేష్, నల్లగొండ