9 May, 2026 | 1:19 PM

Breaking News

తమిళనాడులో రాజకీయ సంక్షోభం.. హైదరాబాద్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు   •   నిర్బంధ రాజకీయాలకు ముగింపు పలకాలి   •   కాంగ్రెస్ నాయకత్వ చర్చల నడుమ — కేరళ సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ   •   గోలేటి స్పోర్ట్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా దీకొండ సంజీవ్‌కుమార్   •   ఇంటి పనోళ్ల వివరాలు పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలి   •   ఐపీఎస్ అధికారి భార్య హత్యకేసులో విచారణ వేగవంతం. రంగంలోకి 10 ప్రత్యేక పోలీసు బృందాలు   •   బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం   •   “Back to Question”: సంగారెడ్డి జైలు నుంచి మన్నె క్రిశాంక్ విడుదల   •   నాభి శిల, ముత్యాలమ్మ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   పెద్దమల్లారెడ్డిలో విద్యుత్ షాక్‌తో మహిళ మృతి   •  

రైతుల బకాయిలు చెల్లించాలని సుదర్శన్ రెడ్డికి వినతి

03-12-2025 05:19 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో పీఏసీఎస్, ఎఫ్ఏసీఎస్, మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన మొక్కజొన్న బకాయిలు విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డికి నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కూచాడి శ్రీహరి రావుతో కలిసి బుధవారం జిల్లా కలెక్టరేట్ లో వినతి పత్రం అందజేశారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన మొక్కజొన్నకు సంబంధించి రూ. 20 కోట్లు బకాయి చెల్లింపులు పెండింగ్ లో ఉన్నాయని పేర్కొన్నారు. వెంటనే విడుదల చేయాలని కోరారు. స్పందించిన సుదర్శన్ రెడ్డి సీఎం పేషిలో మాట్లాడి రైతుల ఖాతాల్లో వారం రోజుల్లో డబ్బులు జమ అయ్యేలా చూస్తానని హామీ  ఇచ్చారు