9 May, 2026 | 2:18 PM

Breaking News

మాటల ప్రభుత్వం కాదు.. మాది చేతల ప్రభుత్వం   •   అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన బిజెపి నాయకులు తంబళ్ల రవి   •   తమిళనాడులో రాజకీయ సంక్షోభం.. హైదరాబాద్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు   •   నిర్బంధ రాజకీయాలకు ముగింపు పలకాలి   •   కాంగ్రెస్ నాయకత్వ చర్చల నడుమ — కేరళ సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ   •   గోలేటి స్పోర్ట్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా దీకొండ సంజీవ్‌కుమార్   •   ఇంటి పనోళ్ల వివరాలు పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలి   •   ఐపీఎస్ అధికారి భార్య హత్యకేసులో విచారణ వేగవంతం. రంగంలోకి 10 ప్రత్యేక పోలీసు బృందాలు   •   బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం   •   “Back to Question”: సంగారెడ్డి జైలు నుంచి మన్నె క్రిశాంక్ విడుదల   •  

తమిళనాడులో రాజకీయ సంక్షోభం.. హైదరాబాద్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

09-05-2026 01:15 PM

హైదరాబాద్: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో తమ ఎమ్మెల్యేలను(Tamil Nadu Congress MLAs) ఇతర పార్టీలు ప్రలోభాలకు గురిచేసి లాగేసుకునే ప్రయత్నాలను అడ్డుకునే వ్యూహంలో భాగంగా ఆ రాష్ట్రానికి చెందిన ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శనివారం హైదరాబాద్‌లో మకాం వేశారు.

గతంలో తెలంగాణలో పార్టీ వ్యవహారాల AICC ఇన్‌చార్జిగా వ్యవహరించిన మేలూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే పి. విశ్వనాథన్, హైదరాబాద్‌లో బస చేసిన ఐదుగురు ఎమ్మెల్యేల బృందానికి నాయకత్వం వహించారని పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ ఇప్పటికే TVKకి తన మద్దతును ప్రకటించిందని, ఒకవేళ TVK ప్రభుత్వం ఏర్పడితే విశ్వనాథన్ మంత్రి అయ్యే అవకాశం ఉందని ఆ వర్గాలు తెలిపాయి. తమిళనాడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు శంషాబాద్‌ నోవాటెల్ కు చేరుకున్నారు. తమిళనాడులో రాజకీయ సంక్షోభం ముగిసే వరకు తమిళనాడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు శంషాబాద్‌ నోవాటెల్‌లో ఉండనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.