ప్రజా సమస్యలను పరిష్కరించాలని వినతి
19-05-2026 12:01 AM
మేడిపల్లి, (విజయక్రాంతి): బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని చెంగిచెర్ల, బోడుప్పల్ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్యాదవ్, బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ్యాదవ్, మేడ్చల్ జిల్లా బీ-బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్గౌడ్తో కలిసి మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డికి సోమవారం వినతిపత్రం అందజేశారు.






