15 June, 2026 | 2:36 PM

Breaking News

పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •  

ముత్యంపేట గ్రామంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

26-01-2026 06:13 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం ముత్యంపేట గ్రామంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో జాతీయ జెండాను ఎగరవేసి దేశభక్తి వాతావరణంలో కార్యక్రమాలు నిర్వహించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, భారత రాజ్యాంగ విలువలకు నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో ఆశా బోయిన అక్షరా శ్రీనివాస్, ఉప సర్పంచ్ మహేందర్ గౌడ్, గ్రామ పాలకవర్గ సభ్యులు చురుకుగా పాల్గొన్నారు. అలాగే గ్రామ సెక్రటరీ అంజయ్య, మాజీ చైర్మన్ రమణారెడ్డి హాజరై వేడుకలకు విశేషంగా తోడ్పడ్డారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ... దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడి పాత్ర కీలకమని, రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. గ్రామాభివృద్ధి కోసం ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.