10 April, 2026 | 8:52 PM

Breaking News

ప్రజల ఆరోగ్య పరిరక్షణకే ప్రత్యేక వైద్య శిబిరం   •   అందరి సహకారంతోనే గ్రామాభివృద్ధి   •   నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ డిసిసి ఉపాధ్యక్షుడిని సన్మానం   •   గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్   •   చిన్నారికి ఆర్థిక సాయం అందజేసిన పిఎసిఎస్ మాజీ చైర్మన్ జాలే నరసింహారెడ్డి   •   శివంగాలపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహణ   •   బనిగండ్లపాడులో మెగా హెల్త్ క్యాంపును ప్రారంభించిన బండారు   •   నిమ్మపల్లిలో యువతి అదృశ్యం – పోలీసుల దర్యాప్తు ప్రారంభం   •   నూతన తహసిల్దార్ ని మర్యాద పూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు   •   విద్యుత్ శాఖ కాంపౌండ్ లో అగ్నిప్రమాదం   •  

నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన ఆర్డీవో సదానందం, ఏసీపీ నర్సింలు

09-10-2025 02:03 PM

దౌల్తాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ దాఖలు ప్రక్రియ(Nomination process) సజావుగా సాగాలని ఆర్డీవో సదానందం(RDO Sadanandam) అన్నారు. గురువారం దౌల్తాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని సిద్దిపేట ఆర్డీవో సదానందం, గజ్వేల్ ఏసీపీ నర్సింలు ప్రత్యక్షంగా సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు ఎన్నికల నిబంధనలు కచ్చితంగా పాటించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అభ్యర్థులు సమర్పిస్తున్న నామినేషన్ పత్రాలను పరిశీలించి ఎటువంటి లోపాలు లేకుండా శ్రద్ధగా స్వీకరించాలని ఆర్డీవో సదానందం సూచించారు.

అంతే కాకుండా నామినేషన్ దశలో ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ నర్సింలు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, ప్రశాంతంగా కొనసాగేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.తొగుట సీఐ లతీఫ్, తహశీల్దార్ చంద్రశేఖర్ రావు,ఇంచార్జ్ ఎంపీడీవో సయ్యద్ గఫూర్ ఖాద్రీ,ఎస్సై గంగధర అరుణ్ కుమార్ తదితరులున్నారు.