10 వరకు వర్షాలే
వాతావరణ కేంద్రం
హైదరాబాద్, మే 3 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఈ నెల 10వ తేదీ వరకు వర్షాలు కురువనున్నాయి. రెండు రోజుల పాటు గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో ఎటువంటి మార్పు ఉండదని, ఆ తర్వాత మూడు రోజుల్లో 2 నుంచి 3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. సోమవారం ఉరుములు, మెరుపులు, గంటకు 40 కి.మీ.ల వేగంతో ఈదురు గాలులతోపాటు వడగళ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశముంది.
భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, మహబూబాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ను జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. ఈ నెల 5 నుంచి 10 వరకు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వరకు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.






