గాలి వాన భీభత్సం
03-05-2026 05:21 PM
మంగపేట,(విజయక్రాంతి): ములుగు జిల్లా మంగపేట మండలంలో కొత్తూరు మొట్లగూడెం గ్రామంలో ఆదివారం సాయంత్రం గాలి వాన భీభత్సం సృష్టించింది. ఆదివారం సాయంత్రం కొత్తూరు మొట్లగూడెం గ్రామంలో ఈదురు గాలులతో కూడిన రాళ్ల వర్షం పడడంతో పలు గుడిసెలు దెబ్బతిన్నాయి. ఒకటి, రెండు గుడిసెలు కూలాయి. గుడిసెలపై ఉన్న పరదాలు గాలికి ఎగిరి కొట్టుకుపోయాయి. చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. కోతకు వచ్చిన వారి చేలు నేలవాలడంతో అన్నదాతకు తీరని నష్టం వాటిల్లింది.






