13 May, 2026 | 1:17 PM

Breaking News

పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో విచారణ.. బండి భగీరథ్ రాకపై ఉత్కంఠ   •   విజిల్ గుర్తు.. తమిళనాడు చరిత్ర మార్చింది: సీఎం విజయ్   •   బాన్సువాడ ఆర్డీవో గా రవీందర్ రెడ్డి   •   వడదెబ్బపై అవగాహన.. ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ   •   సత్తుపల్లి నుంచి అంకంపాలెం వరకు నూతన బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె   •   బలపరీక్షలో నెగ్గిన విజయ్‌ సర్కార్.. అసెంబ్లీ నుంచి డీఎంకే వాకౌట్   •   షాద్‌నగర్ బైపాస్‌లో ప్రమాదం..!   •   అండర్ డ్రైనేజీ వేసాకే సీసీ రోడ్లు వేయండి   •   రేపు అశ్వారావుపేటలో రాష్ట్రస్థాయి పామాయిల్ రైతుల ఆత్మీయ సమావేశం   •   కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థత.. గురుగ్రామ్ ఆసుపత్రిలో చేరిక   •  

పంజాబ్, ఢిల్లీ మ్యాచ్ రద్దు

09-05-2025 03:33 AM
  1. పాక్ దాడుల నేపథ్యంలో మ్యాచ్ నిలిపివేత
  2. ఆటగాళ్లను తరలించేందుకు ప్రత్యేక ట్రైన్ ఏర్పాటు చేసిన బీసీసీఐ 

ధర్మశాల, మే 8: ఐపీఎల్ 18వ సీజన్‌లో గురువారం పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ రద్దయింది. జమ్మూ సహా పలు ప్రాంతాల్లో పాక్ దాడుల నేపథ్యంలో ఆటగాళ్ల భద్రతను దృష్టిలో పెట్టుకొని మ్యాచ్‌ను నిలిపేస్తున్నట్టు ఐపీఎల్ యాజమాన్యం ప్రకటించింది. ఆటగాళ్ల భద్రతను దృష్టిలో ఉం చుకొని వాళ్లను తరలించేందుకు బీసీసీఐ ప్రత్యేక ట్రైన్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపింది. భారత గగనతలంలోకి పాక్ డ్రోన్లు దూసుకొస్తుండడంతో సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని ముం దుగా స్టేడియంలోని ఫ్లడ్‌లైట్లను ఒక్కొక్కటిగా ఆర్పివేస్తూ వచ్చారు.

ఆ తర్వాత పాక్ దాడుల నేపథ్యంలో మ్యాచ్ నిలిపివేస్తున్నామని.. అసౌకర్యానికి చింతిస్తున్నట్టు ధర్మ శాల క్రికెట్ అసోసియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నేపథ్యంలో పోలీసు లు క్రికెట్ అభిమానులను స్టేడియం నుంచి బయటకు వచ్చే ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇక మ్యాచ్ నిలిచిపోయే సమయానికి పంజాబ్ 10.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 122 పరుగులు చేసింది. ప్రియాన్ష్ ఆర్య (70), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (50 నాటౌట్) రాణించారు.