22 April, 2026 | 11:36 AM

Breaking News

TGSRTC Strike: ఆర్టీసీ సమ్మె ప్రభావం.. డిపోకే పరిమితమైన బస్సులు   •   కాళేశ్వరం కేసులో KCR, Harishలకు భారీ ఊరట: హైకోర్టు సంచలన తీర్పు   •   పీసీ ఘోష్ కాళేశ్వరం నివేదికపై తుది తీర్పు   •   ఆర్టీసీ కార్మికుల సమ్మె— రోడ్డెక్కని బస్సులు   •   కామారెడ్డి బస్టాండ్‌లో ఉద్రిక్తత.. బస్సు గాలి తీసేసిన ఆర్టీసీ కార్మికులు   •   తెలంగాణలో ఆర్టీసీ సమ్మె— ప్రయాణికులకు తిప్పలు   •   సత్తుపల్లిలో హోరెత్తిన ఆర్టీసీ సమరభేరి: స్తంభించిన రవాణా వ్యవస్థ   •   కామారెడ్డి జిల్లాలో ఎక్కడికక్కడ నిలిచిపోయిన బస్సులు   •   RTC Strike Today: డిపోల వద్ద సమ్మె.. వందల బస్సులు నిలిపివేత   •   ఆగిపోయిన ఆర్టీసీ రథచక్రం   •  

వైభవంగా కన్నె పూజ..

01-10-2025 07:35 PM

భారీగా హాజరైన చిన్నారి బాలికలు..

తాండూరు (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల కేంద్రం శ్రీ హనుమాన్ దేవాలయంలో శ్రీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చిన్నారి బాలికలకు కన్నె పూజను విశ్వహిందూ పరిషత్, హిందూ వాహిని, బజరంగ్దళ్ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. వేద పండితులు గురాచారి జోషి చేసిన మంత్రోచ్ఛారణల మధ్య చిన్నారులకు పాదపూజ నిర్వహించి కానుకలు అందించారు. ఈ సందర్భంగా వేద పండితులు గురాచారి జోషి మాట్లాడుతూ చిన్నారులు కల్మషం లేని దైవంశ సంభూతులని వారిలో దుర్గామాతను కొలిచే విధంగా చూడాలని అన్నారు. అనంతరం తీర్థప్రసాదాలు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు యువకులు గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.