23 May, 2026 | 6:41 PM

Breaking News

కష్టపడే కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది   •   ఎమ్మెల్యే మున్సిపాలిటీ లో ఎక్స్ టెన్షన్ కౌంటర్ గా మార్చారు   •   చట్టాలపైన అవగాహన లేకనే కేసుల్లో ఇరుక్కుపోతున్నారు   •   ఇతర రాష్ట్రాల కార్మికుల వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభం   •   చోరీ కేసులో నిందితుడు అరెస్ట్.. బంగారం, వెండి వస్తువుల స్వాధీనం   •   పేరు మార్పిడి చేసిన రెవెన్యూ ఉద్యోగిని సస్పెండ్ చేయాలి   •   జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఛైర్మెన్ గా దూమల రాజ్ కుమార్   •   తాడువాయిలో జీలుగ విత్తనాల పంపిణీ   •   రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులుగా గడ్డం రాజశేఖర్ నియామకం   •   నందివాడలో ఉపాధి పనుల పరిశీలన   •  

వాలీబాల్ క్రీడల విజేతలకు బహుమతులు అందజేత

15-01-2026 12:06 AM

మాజీ ఎంపీటీసీ మాలోత్ అంకిత రవి నాయక్

మేడ్చల్ అర్బన్, జనవరి 14 (విజయక్రాంతి): ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని రాజ బొల్లారం తండాలో మాజీ ఎంపీటీసీ మాలోత్ అంకిత రవి నాయక్ ఆధ్వర్యంలో వాలీబాల్ క్రీడల టోర్నమెంట్ ను నిర్వహించినట్లు తెలిపారు.ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాలోత్ రవి నాయక్ మాట్లాడుతూ వాలీబాల్ క్రీడల టోర్నమెంట్ లో 5 టీం లు పాల్గొన్నాయని చెప్పారు.

వాలీబాల్ క్రీడలలో ప్రథమ బహుమతి పవన్ టీంకు ట్రోఫీతో పాటు 5000 వేల నగదు, రెండవ విజేతకు రన్నర్ అప్ ట్రోఫీతో పాటు 2000 నగదు బహుమతిని మాజీ ఎంపీటీసీ అంకిత రవి నాయక్ చేతుల మీదుగా అందజేసినట్లు చెప్పారు.యువతకు గ్రామీణ ప్రాంతాలలో క్రీడలను నిర్వహిస్తే వారు మానసిక ఒత్తిడి లేకుండా చురుకుగా ఉండడమే కాకుండా చదువులతో పాటు ఆటలు కూడా మంచి విజయాలను సాధిస్తాయని రవి నాయక్ స్పష్టం చేశారు.రాజ బొల్లారం తండాలో నిర్వహించిన వాలీబాల్ క్రీడలకు సహకరించిన మాలోత్ సాయికుమార్,కరెంట్ రాజ్ కుమార్ లతో పాటు తండా పెద్దలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.