Odisha Hospital Tragedy: ప్రాణనష్టం చాలా బాధాకరం
న్యూఢిల్లీ: ఒడిశాలోని ఒక ఆసుపత్రిలో సంభవించిన అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Droupadi Murmu) సోమవారం సంతాపం వ్యక్తం చేశారు. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. కటక్లోని ఒడిశా ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎస్సీబీ వైద్య కళాశాల, ఆసుపత్రిలోని ఐసీయూలో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం(Odisha hospital fire) సంభవించడంతో కనీసం పది మంది రోగులు మరణించారని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ తెలిపారు. "ఒడిశాలోని కటక్లోని ఒక ఆసుపత్రిలో జరిగిన విషాదకరమైన అగ్నిప్రమాదంలో ప్రాణనష్టం చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను" అని రాష్ట్రపతి ముర్ము ఎక్స్ పోస్ట్లో పేర్కొన్నారు.




