5 March, 2026 | 10:44 PM

వడదెబ్బ నివారణకు జాగ్రత్తలు పాటించాలి

05-03-2026 05:39 PM

వైద్యాధికారిణి దివ్య

భిక్కనూర్, మార్చి05,(విజయ క్రాంతి): వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మండల వైద్యాధికారిణి దివ్య సూచించారు. గురువారం ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన ‘ఆశా డే’ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది గ్రామాల్లో పర్యటించి ఇంటింటికీ ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేయాలని ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆరోగ్య పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించి వాటిని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఈఓ వెంకటరమణతో పాటు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.