9 May, 2026 | 4:48 PM

Breaking News

సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర   •   దూరదర్శన్ భవన్‌లో అగ్నిప్రమాదం.. ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు   •   టీవీకే ప్రభుత్వ ఏర్పాటుపై వీడని సస్పెన్స్.. వీసీకే పార్టీ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ   •   కొత్తగూడెంలో ఘనంగా కంట మహేశ్వరుని కళ్యాణ మహోత్సవం   •   పల్లకి సేవలో వట్టెం వెంకన్న   •   భీమిరెడ్డి నరసింహారెడ్డి 18వ వర్ధంతి   •   మొక్కజొన్న రైతుల ఉసురు తగలదా   •   మూసీలో పడిపోయిన మహిళను కాపాడిన హైడ్రా   •   నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ (ఎన్సిసి) అవగాహన సదస్సు..   •   స్వాములకు ఉచితంగా అన్న ప్రసాదం   •  

ఎక్కడ చూసినా ముందస్తు ఇసుక మొరం డంప్ లు

09-05-2026 03:45 PM

బోథ్,(విజయక్రాంతి): రానున్న వర్షాకాలం ని దృష్టిలో పెట్టుకొని అక్రమ ఇసుక ,మొరం వ్యాపారులు ముందు చూపు తో ఇసుక మొరం డంప్ లు సిద్ధం చేసుకుంటున్నారు. బోత్ .సోనాల. మండలాలకు అర్ధరాత్రి అక్రమంగా జీరోలో ఇసుక చేరుతున్నది. మరోవైపు స్థానికంగా ఉన్న అడవుల్లో నుండి రాత్రిపూట మొరం తరలించి నిలువ ఉంచుతున్నారు. అదిలాబాద్ పెనుగంగ నుండి టిప్పర్లను నల్ల ఇసుకను తీసుకువచ్చి నిల్వ ఉంచుతున్నారు. ఇక కొంతమంది ట్రాక్టర్ల యజమానులు గ్రామాల సమీపంలోని వాగుల నుండి నల్ల ఇసుకను తీసుకువచ్చి డంపు చేసి ఉంచుతున్నారు. అయితే స్థానిక ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని అధిక ధరల్లో విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అక్రమ ఈ వ్యాపారం అధికారులకు కనిపించడం లేదా అన్న విమర్శలు వస్తున్నాయి.