పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు
14-03-2026 02:49 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో పదవ తరగతి పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద నిబంధనలను అతిక్రమించిన ఇతర అక్రమాలకు పాల్పడ్డ చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సాయికిరణ్ రూలర్ సిఐ కృష్ణ పోలీసులు ఉన్నారు




