4 May, 2026 | 2:54 AM

నీట్-యూజీ పరీక్ష కేంద్రాలను సందర్శించిన పోలీస్ కమిషనర్

04-05-2026 01:37 AM

ఖమ్మం టౌన్, మే 3(విజయ క్రాంతి): వైద్య, విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్-యూజీ 2026 పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ బందోబస్త్, భద్రతను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదివారం సందర్శించి, పరిశీలించారు. మధ్యాహ్నం 12గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు పరీక్షా కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో  బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 163 అంక్షాలు అమలులో ఉంటుందన్నారు. శాంతి నగర్ కాలేజ్, కేంద్రీయ విద్యాలయం సందర్శించిన పోలీస్ కమిషనర్ టౌన్ ఏసీపీ రమణమూర్తి కి పలు సూచనలు చేశారు.