3 July, 2026 | 10:29 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన

03-07-2026 09:54 PM

వెల్దుర్తి,(విజయక్రాంతి): ప్రైవేటు పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు  అమ్ముతూ విద్యార్థుల తల్లిదండ్రులను తీవ్రంగా నష్టపరిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు ప్రశాంత్ డిమాండ్ చేశారు. వెల్దుర్తి ప్రైవేట్ పాఠశాల వద్ద  ఎక్కువ ధరకు పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల నాయకులు స్కూల్ ఎదుట ఆందోళన చేపట్టారు.అధిక ఫీజులు కూడ వసూలు చేస్తున్నారని నాయకులు ఆరోపించారు. అక్కడికి చేరుకున్న పీఎం శ్రీ  కాంప్లెక్స్ హెచ్ఎం సాంబయ్య  మండల విద్యాధికారి తో మాట్లాడి  ఇట్టి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో  నాయకులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు పాల్గొన్నారు.