19 May, 2026 | 10:18 PM

Breaking News

ఖమ్మం - సూర్యాపేట జాతీయ రహదారిపై రాస్తారోక చేస్తున్న మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్   •   డీజీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ డిసిసిబి చైర్మన్   •   రూ.21.49 లక్షల విలువైన నకిలీ వరి విత్తనాల పట్టివేత   •   హిజ్రాల ఆగడాలకు చెక్ పెట్టేందుకు పోలీస్ శాఖ చర్యలు   •   పీహెచ్సీలో అందిస్తున్న వైద్య సేవల పరిశీలన   •   ధాన్యం అన్‌లోడింగ్‌లో జాప్యం లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి   •   ఆందోళన వద్దు.. బంద్ రోజున మందులు అందుబాటులోనే   •   మంగళవారం సంతలో పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం   •   మొక్కజొన్న స్టాక్ పాయింట్లను తనిఖీ చేసిన డీఎం   •   ఖానాపూర్ మండలంలో పైలట్ గ్రామాన్ని సందర్శించిన అధికారులు   •  

సైబర్ నేరాలపై పోలీసుల అవగాహన

10-12-2025 12:21 AM

రామాయంపేట, డిసెంబర్ 9 :సైబర్ నేరాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి స్థానిక సీఐ వెంకట రాజాగౌడ్, ఎస్త్స్ర బాలరాజ్ ఆధ్వర్యంలో రామాయంపేటలో కళాశాల విద్యార్థుల కు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి కాలంలో సైబర్ క్రైమ్లు విపరీతంగా పెరిగినందున సెల్ ఫోన్లు ఉ పయోగించే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలన్నారు.

విద్యార్థులు సైబర్ నేరాల బారిన పడకుం డా మోసపోవద్దన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండి చక్కటి విద్యను అభ్యసించాలన్నారు. ఈ కార్యక్రమంలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారి సతీశ్, హెడ్ కానిస్టేబుల్ సుధాకర్, చత్రపతి శివాజీ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ సందీప్ కుమార్,  విద్యార్థులు పాల్గొన్నారు.