26 April, 2026 | 6:57 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

పొంగల్ ప్రపంచ పండుగ: ప్రధాని మోదీ

14-01-2026 01:03 PM

న్యూఢిల్లీ: ప్రకృతితో సామరస్యపూర్వక సమతుల్యతను కాపాడుకోవాలనే సందేశాన్ని ఇచ్చే పొంగల్ పండుగ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళులందరూ ఆదరించే ఒక ప్రపంచ పండుగగా ఆవిర్భవించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం అన్నారు. కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ నివాసంలో జరిగిన పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధానమంత్రి, ఈ పండుగ రైతుల కష్టాన్ని కొనియాడుతుందని, భూమి, సూర్యుడికి కృతజ్ఞతలు తెలియజేస్తుందని అన్నారు. తమిళ సంక్కృతికి సంబంధించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నానని చెప్పిన ప్రధాని మోదీ వెయ్యేళ్ల గంగైకొండ చోళపురం ఆలయంలో పూజలు చేశానని చెప్పారు. యావత్ భారత్ వారసత్వాన్ని తమిళ సంస్కృతి చాటిచెబుతోందన్నారు. 

పొంగల్ పండుగ కృతజ్ఞత కేవలం మాటలకే పరిమితం కాకుండా, మన దైనందిన జీవితంలో అంతర్భాగం కావాలని మనకు గుర్తు చేస్తుందని మోదీ అన్నారు. భూమి మనకు ఇంతటి సంపదను ప్రసాదిస్తున్నప్పుడు, దానిని ప్రేమగా చూసుకోవడం, పరిరక్షించడం మన బాధ్యతన్నారు. ప్రపంచవ్యాప్తంగా తమిళ సమాజం, తమిళ సంస్కృతిని ప్రేమించే వారందరూ పొంగల్ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారని, వారిలో తాను కూడా ఒకరిగా ఉన్నందుకు గర్వపడుతున్నానని ప్రధాని తెలిపారు. తమిళ సంస్కృతి ప్రపంచంలోని అత్యంత ప్రాచీన జీవన నాగరికతలలో ఒకటి అని, అది శతాబ్దాల జ్ఞానాన్ని మరియు సంప్రదాయాలను కలిగి ఉందని, చరిత్ర నుండి పాఠాలు నేర్చుకుంటూ భవిష్యత్తుకు మార్గం చూపిస్తుందని మోదీ అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు, సమాజంలోని వివిధ వర్గాల ప్రజలు పాల్గొన్నారు.