26 April, 2026 | 5:03 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా భోగి వేడుకలు

14-01-2026 11:35 AM

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలు(Bhogi celebrations) ఘనంగా జరుగుతున్నాయి. మూడు రోజుల పంటల పండుగ సంక్రాంతి, తెలంగాణలో బుధవారం 'భోగి'తో ప్రారంభమైంది. పండుగలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా తెల్లవారుజామున భోగి మంటలు వెలిగించారు. కుటుంబసభ్యులు, బంధువులతో కలిసి చిన్నారులు భోగిమంటలు వేశారు. ఈ మూడు రోజుల పండుగను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో భోగి, మకర సంక్రాంతి, కనుమ పేర్లతో జరుపుకుంటారు. 

తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ(Telangana Governor Jishnu Dev Varma), ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఇతర నాయకులు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి ముగ్గులతో అలరారుతున్న తెలుగు లోగిళ్లలో భోగి పండుగ జరుపుకుంటున్న తెలుగు ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దేదీప్యమానంగా వెలిగే భోగి మంటలు మీకు, మీ కుటుంబానికి కొత్త వెలుగులు తేవాలని మనసారా ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు. ఆశావహ దృక్పథంతో సాగే మీ ఆలోచనలు సాకారం కావాలని... అందుకు మీకు అండగా ఉంటానని ఈ సందర్భంగా చంద్రబాబు తెలియజేశారు.