18 July, 2026 | 12:06 PM

Breaking News

విక్రమ్-1 రాకెట్ ప్రయోగం వాయిదా   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •   వనదుర్గమ్మను దర్శించుకున్న సినీ నటుడు మంచు విష్ణు   •   సోనమ్ వాంగ్‎చుక్ దీక్ష భగ్నం.. ఆసుపత్రికి తరలింపు   •  

ప్లాస్టిక్‌తో పర్యావరణానికి ముప్పు

10-10-2025 12:41 AM

సూర్యాపేట, అక్టోబర్ 9 (విజయక్రాంతి) : సింగిల్ యూజ్ ప్లాస్టిక్తో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని ప్రముఖ వ్యాపారవేత్త యామ ప్రభాకర్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని బాలభవన్ లో ప్లాస్టిక్ వాడకంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ క్లాత్ సంచులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ సముద్రాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయన్నారు.

తద్వారా సముద్ర జీవులకు హాని కల్గిస్తున్నాయన్నారు. తాబేళ్లు, సీల్స్, పక్షులు, జంతువులు ప్లాస్టిక్ వ్యర్థాలలో చిక్కుకుని గాయాలు, మరణానికి గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అనేక దేశాలు ప్లాస్టిక్ సంచులు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్లను నిషేధించాయన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా 9 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలను మాత్రమే రీసైకలింగ్ చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి దేవరాజ్, బండి రాధాకృష్ణ రెడ్డి, వీరు నాయుడు, అరుంధతి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.