18 July, 2026 | 12:23 PM

Breaking News

Vikram-1 రాకెట్ విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం   •   విక్రమ్-1 రాకెట్ ప్రయోగం వాయిదా   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •   వనదుర్గమ్మను దర్శించుకున్న సినీ నటుడు మంచు విష్ణు   •  

అవయవదానం ద్వారా ఇతరులకు కొత్త జీవితం ఇచ్చే దాతలు స్ఫూర్తిదాయకులు

10-10-2025 12:40 AM

సదాశివ ఫౌండేషన్ 17వ వార్షికోత్సవం లో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్

 గోదావరిఖని, అక్టోబర్ 9(విజయ క్రాంతి) అవయవదానం ద్వారా ఇతరులకు కొత్త జీవితం ఇచ్చే దాతలు స్ఫూర్తిదాయకులని సదాశివ ఫౌండేషన్ 17వ వార్షికోత్సవంలో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. గురువారం గోదావరిఖని సీమ్స్ కాలేజీలో నిర్వహించిన సదాశయ ఫౌండేషన్ 17వ వార్షికోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేత్ర, అవయవ, శరీర దానం చేసిన కుటుంబాలను ఎమ్మెల్యే సత్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మానవతా విలువలను నిలబెట్టే ఈ రకాల సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శప్రాయమైనవి. అవయవదానం ద్వారా ఇతరులకు కొత్త జీవితం ఇచ్చే దాతలు, వారి కుటుంబాలు స్ఫూర్తిదాయకులని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు, వైద్యులు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.