10 May, 2026 | 2:46 PM

Breaking News

సీఎం విజయ్‌కి అభినందనలు తెలిసిన ప్రధాని మోదీ   •   మల్లెల మడుగులో ప్రగతి పరుగు..   •   లేబర్ కోడ్లు రద్దు చెయ్యాలని కోరుతూ గెజిట్ ప్రతులు దగ్దం   •   అధికారుల అలసత్వం వల్ల అకాల వర్షాలకు నష్ట పోయిన రైతులు – సీపీఎం జిల్లా నాయకులు పిట్టల అర్జున్   •   వనదుర్గమ్మ ఆదాయానికి అధికారుల గండి   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం సద్వినియోగం చేసుకోవాలి   •   కియా సైరోస్ ప్రారంభించిన హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి   •   కందనూల్ క్విడ్ ప్రోకో వ్యవహారంలో పరస్పర దాడులు.!   •   అంతిమ యాత్రలో పాడే మోసి అభిమానాన్ని చాటుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   మోడీ సభకు ప్రత్యేక రైలులో బిజెపి శ్రేణులు   •  

అణగారిన వర్గాల విద్యాభివృద్ధికి జీవితాంతం పోరాడిన మహోన్నత వ్యక్తి పూలే

29-11-2025 12:00 AM

అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

ములకలపల్లి /దమ్మపేట,నవంబర్ 28 (విజయక్రాంతి):దమ్మపేట మండలం గండుగులపల్లి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మహాత్మా జ్యోతిరావు పూలె వర్ధంతి వేడుకలను నిర్వహించారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పూలే చిత్రపటానికి పుష్పాంజలి అర్పించి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలె వెనుకబడిన, అణగారిన వర్గాల విద్యాభివృద్ధికి జీవితాంతం పోరాడిన మహోన్నత వ్యక్తి అని పేర్కొన్నారు.

సమాజంలో సమానత్వం విద్య అందరికీ అందుబాటులో ఉండాలనే ఆశయంతో ఆయన చూపించిన మార్గం నేటి తరానికి ఎంతో ప్రేరణనిస్తుందని అన్నారు. గ్రామాల్లో విద్య మహిళా సాధికారత సామాజిక న్యాయం కోసం ప్రభుత్వం తీసుకొస్తున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూలే ఆశయాలను ముందుకు తీసుకుపోవడం మనందరి బాధ్యత అని ఇదే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.